Saturday, January 28, 2012

నవభారత పుత్రులారా! నిర్మోహితులు కండు


"ఉత్తిష్టత, జాగ్రత, ప్రాప్యవరాన్నిబోధత!" 'లెండు, మేల్కొనుడు, పరమార్ధము చేరువరకు ఆగకుడు' అని ప్రతి జీవికిని చాటి చెప్పుదుము గాక!" "లెండు, మేల్కొనుడు! దుర్బలత నుండి, సమ్మోహనము నుండి తెప్పరిల్లుడు. నిజముగా ఎవడును దుర్బలుడు కాడు! ఆత్మ అఖండము; సర్వశక్తిమంతము, సర్వజ్ఞము. లేచి నిలబడుడు! మీ స్వరూపమును ప్రకటింపుడు! మీలో నున్న బ్రహ్మమును ప్రకాశింపచేయుడు! వానిని నిర్లక్ష్యము చేయకుడు. మితిమీరిన సోమరితనము, మితిమీరిన దౌర్బల్యము, మితెమీరిన మోహజాలము శనిదేవత వలె మన నెత్తిపైకెక్కి చిందులు ద్రొక్కుచున్నవి. 

----------------------------------------------------------------------
మన ప్రాచీన జనయిత్రి మరల మేల్కొనినది. ఆమె తన సింహాసనము నధిష్టించినది. అపూర్వమైన శోభతో ఉత్తేజితమైనది. శాంతి స్వరముతో, మంగళ వచనములతో ఆమెను గురించి జగత్తునకు చాటిచెప్పుడు
----------------------------------------------------------------------

ఓహో! నవభారత పుత్రులారా! మీ సమ్మోహనము విదిల్చివేసికొనుడు. దానికి వలయు మార్గము మీ శాస్త్రములందే  కలదు. మీ సత్య స్వరూపమును మీరు తెలిసికొనుడు. ప్రతివానికి వాని స్వస్వరూపము బోధింపుడు. నిద్రలో పడియున్న జీవుని ఎలుగెత్తి పిలువుడు. ఓహో! అతడెటుల మేల్కొనునో మీరే చూడగలరు. ఆ సుప్తజీవి మేల్కాంచి, స్వస్వరూప జ్ఞానముతో కార్యపరుడగునప్పుడు అతనికి శక్తి వచ్చును; తేజము వచ్చును; శుభము గలుగును; పవిత్రతయు వచ్చును. ఉత్క్రుష్టమగునదెల్ల  అతనిని వరించును.

భవిష్యత్తు విషయమై నేనాలోచించుట లేదు; ఆ విషయమై నాకు శ్రద్ధ లేదు. ఒక దివ్య దృశ్యమును మాత్రమే నేను చూచుచున్నాను. జీవితమంతా స్పష్టముగా కనుచున్నాను. అది ఇది - మన ప్రాచీన జనయిత్రి మరల మేల్కొనినది. ఆమె తన సింహాసనము నధిష్టించినది. అపూర్వమైన శోభతో ఉత్తేజితమైనది. శాంతి స్వరముతో, మంగళ వచనములతో ఆమెను గురించి జగత్తునకు చాటిచెప్పుడు".  
________________________________________________________________________

64 సంవత్సరాల మన స్వతంత్ర భారతం

ఆగస్టు 15 నాడు 'లైవ్ ఇండియా' టివి చానెల్ లో ప్రసారమైన అంశాల ఆధారంగా


భారతదేశం భవిష్యత్తుపై ఆశతో, సమాజ శరీరానికి అయ్యిన గాయాలతో.. నెత్తురోడుస్తూ.. మౌంట్ బాటెన్ కుయుక్తులతో.. మత పరంగా విభజింపబడి.., లక్షలాది శవాల మధ్యన.. 1947 ఆగస్టు 15 న బ్రిటిషు వారి నుండి స్వాతంత్ర్యాన్ని పొంది 1950 లో రాజ్యాంగాన్ని నిర్మించికొని సకల మర్యాదలతో మౌంట్ బాటెన్ కు వీడ్కోలు పలికింది. 

సర్దార్ పటేల్ మొక్కవోని దీక్షతో విడిపోయిన హృదయాలను అతికించి, జన సామాన్యాన్ని కలిపారు. 1951 అక్టోబర్ 25 న రాజ్యాంగం అనే నిబద్ధతను ఏర్పరచుకొని రాజకీయ విలువలను ఏర్పరిచే ప్రయత్నంతో మొట్టమొదటి ఎన్నికలను హిమాచల్ ప్రదేశ్ లో చీని, అంగీ అనే వోటర్లు వోటు వేయడంతో ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకు బీజం పడింది. 

1951 లో జరిగిన మొట్టమొదటి ఎన్నికలలో ఒక వోటుకు కేవలం 98  పైసలు ఖర్చయ్యాయి. ఈ ఎన్నికలలో 2438 మంది ఎంపీలుగా ఎన్నికయ్యేందుకు పోటీ పడ్డారు. పదిహేడు కోట్ల మంది వోటర్లు మొదటి పార్లమెంటు ఎన్నికలలో వోటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో శ్యాంప్రసాద్ ముఖర్జీ, నెహ్రు, జయప్రకాశ్ నారాయణ వంటి హేమాహేమీలు దేశ వ్యాప్తంగా పర్యటించి ప్రజాస్వామ్యానికి ఊపిరులూదేందుకు కృషి చేశారు. 

శాంతీ-శాంతీ అనే భ్రమ, ప్రపంచ నిజాలు 1962 చైనా యుద్ధంతో నెహ్రూకు తెలిసొచ్చాయి. ఆ తరువాత లాల్ బహదూర్ శాస్త్రి నేతృత్వంలో జైజవాన్ - జైకిసాన్ నినాదంతో కర్షకుడికి, యుద్ధంలోని సైనికుడికి గౌరవమిచ్చే సమాజ నిర్మాణానికి ప్రయత్నాలు జరిగాయి. హరిత విప్లవంతో దిగుబడి పెంచి వ్యవసాయం లాభ దాయకమయ్యేలా, అందరికీ ఆహారం అందేలా ప్రణాళికల స్వరూపాన్ని లాల్ బహదూర్ నాయకత్వం రెండేళ్లలో దేశానికి అందించింది.

అనుమానాస్పద పరిస్థితులలో శాస్త్రీజీ మరణించడంతో ఇందిర ప్రధానిగా ఎన్నికైంది. 1971 లో పాకిస్తాన్ పై యుద్ధం జరిగినప్పుడు ఇందిర తెగువ చూపి బంగ్లాదేశ్ కు ప్రాణం పోసినా, మరల శాంతి మాయలో చిక్కుకొని కాశ్మీర్ గాయాన్ని మాన్పించే చక్కటి అవకాశాన్ని వదులుకొని కాళ్ళ బేరానికి వచ్చిన పాకిస్తాన్ ను వదిలిపెట్టింది. అప్పటి వరకూ ప్రపంచమంతా ఆదర్శంగా తీసుకున్న ప్రజాస్వామ్యం.. 1975 లో స్వార్ధ ప్రయోజనాల కోసం, నియంతృత్వ పోకడలతో ఇందిరాగాంధీ ప్రజాస్వామ్య జీవనాన్ని అపహాస్యం చేస్తూ స్వేచ్చాయుత జీవనాన్ని చీకట్లోకి నెడుతూ, ఒక సంవత్సరం ఎనిమిది నెలల పాటు ఎమర్జెన్సీని విధించడంతో..

సహజంగా చలిత పరిణామం కలిగిన, వెలుతురుని ప్రేమించే సగటు భారతీయుడు సృష్టించిన అలల తుఫానుకు, యువరక్తపు చైతన్యములో ఎగిసిన అలలు సమాజ సముద్రం లో ప్రజాస్వామ్య తుఫానుగా మారి, ఎమర్జెన్సీ తొలగి 1977 లో మొదటిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది.

ఆ తరువాత రాజీవ్ గాంధీ, వి.పి.సింగ్, చంద్ర శేఖర్, పీవీ నరసింహారావు, దేవగౌడ, అటల్ బిహారీ వాజపాయ్ ల సారధ్యములో ప్రజాస్వామ్యంలో కొత్త కొత్త పాఠాలను నేర్చుకొంటూ ఇటలీ వనితను ప్రధాని కాకుండా ఈ ప్రజాస్వామ్యం అడ్డుకోగలిగి, ప్రస్తుతం మన్మోహన్తో కలిపి ఇప్పటి వరకూ 13 మంది ప్రధాన మంత్రులను, 370 కి పైగా ముఖ్యమంత్రులను, 7900 లకు పైగా పార్లమెంటు సభ్యులను, 50100 కి పైగా ఎం.ఎల్.ఏ. లను ఎన్నుకొని బహుముఖ ఆలోచనలతో, స్వేచ్ఛాయుత  సమాజంతో అందరినీ కలుపుకొంటూ, 80 % వోటర్ల హాజరుతో, కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు, కుగ్రామంలోని వోటరు అభిప్రాయాన్ని కూడా గౌరవిస్తూ, వోటరు గుర్తింపు కార్డులతో, సరికొత్త వోటింగు యంత్రాలతో, ఒకవైపు ఆరోపణలతో, రిగ్గింగులతో, విభజన రాజకీయాలతో, మరొక వైపు స్వేచ్చతో, ఐక్యతతో, అందరి అభిప్రాయాన్ని గౌరవిస్తూ, ఎగ్జిట్ పోల్ ని అవహేళన చేస్తూ వోటరు దేవుడు ప్రజాస్వామ్యాన్ని నిలబెడుతూనే ఉన్నాడు.

కులాల శాతానికి, మతాల బుజ్జగింపులకు తాను లొంగనని, స్వచ్ఛమైన నాయకత్వం ఉంటే మార్పు తెస్తానని వోటర్లు ఎన్నోసార్లు రుజువు చేసారు...,

1951 లో వోటుకు 98 పైసలు ఖర్చు అయితే ఇప్పుడు వోటుకు 250 రూపాయలు ఖర్చు కావడం విశేషం. అరవై ఏళ్ళయినా గరీభీ హఠావో నినాదం ఇంకా ఒక అజెండాగా ఉండడం మనం తీవ్రంగా ప్రశ్నించుకోవలసిన  విషయం.

ఆశావహ భారతదేశంలో దాగని నిరాశ  
అరవై నాలుగు సంవత్సరాల భారతావనిలో గాంధీజీ కలలు కన్న రామరాజ్యం అనే ఆశ ఒక స్వప్నంలా కనబడటానికి కారణాలు అనేకం. 

స్వతంత్ర భారతావని ఎలా ఉండాలో గాంధీజీ యంగ్ ఇండియా, హరిజన్ పత్రికలలో స్పష్టంగా పేర్కొన్నారు. దేశంలో ప్రజలందరూ సమగ్రంగా అభివృద్ధి ఫలాలను అనుభవించాలని కోరుకొన్నారు. వివేకానంద దేశంలో కుక్కపిల్ల కూడా ఆహారం లేకుండా మరణించరాదనీ కోరుకున్నారు.

దేశంలో దారిద్ర్యం ఒకవైపు, సంపన్నుల వృద్ధి మరోవైపు నాణేనికి రెండు పార్శ్వాలుగా వృద్ధి చెందాయి. ఒక వైపు అంబానీలు నిమిషానికి 25 రూపాయలు సంపాదిస్తూ ఉంటే మరో వైపు లక్షది మంది గంటకు ఐదు పైసలు కూడా సంపాదించలేని పరిస్థితి. 

భారతదేశంలో ఉండటానికి ఇల్లు, కడుపు నిండా తిండి, వైద్యం చేయించుకోగల స్థోమత, గౌరవనీయంగా కనపడడానికి అవసరమైన బట్ట లేనివారంతా పేదవారే. కాని మాంటెక్ సింగ్ అహ్లువాలియా నాయకత్వంలోని ప్రణాళికా సంఘం దృష్టిలో భారతదేశంలోని పేదల లక్షణాలు అంతకంటే ఘోరంగా ఉండాలి. భారత దేశంలో ఇప్పటికీ అనేకమంది ఆకలి బారినపడి చనిపోతున్నారు. మలేరియా వంటి నయం చేయగల జబ్బులతో కూడా చనిపోతున్న వారు అనేకమంది ఉన్నారు.  ఉండటానికి చోటు లేక, ప్లాట్ ఫాంల మీద, రైల్వే స్టేషన్లలో, రోడ్ల పక్కన తాత్కాలికంగా నీడ ఏర్పాటు చేసుకున్న వారు ప్రతి పట్నంలోనూ కనిపిస్తారు. పని చేయడానికి సిద్ధంగా ఉన్నా, పని దొరకనివారు కోట్లాదిమంది ఉన్నారు. ప్రణాళికా సంఘం లెక్క ప్రకారం భారతదేశంలోని 122  కోట్ల మంది జనాభాలో కేవలం 37 శాతం మందే పేదలు!

దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని పరిగణించడానికి ప్రాతిపదిక ఏమిటని కోర్టు ప్రశ్నించగా, ప్రణాళికా సంఘం తన ప్రాతిపదికను వెల్లడించింది. దాని ప్రకారం (ద్రవ్యోల్బణంతో  సర్దుబాటు చేస్తే) పట్టణంలో నివసిస్తున్న వ్యక్తి నెలకు 578 రూపాయలు (13 డాలర్లు) కంటే ఎక్కువ ఖర్చు పెట్టగలిగినట్లయితే అతను దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నట్లే. అంటే రోజుకు రూ. 20 కంటే తక్కువ. గ్రామంలో ఐతే రోజుకు రూ.15 కంటే ఎక్కువ ఖర్చు చేయగలిగితే అతను పేదవాడు కాదు. అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తే ప్రభుత్వ సహాయానికి అనర్హుడు. 

45  శాతం కటిక పేదలుగానూ 80 శాతం మంది సాధారణ పేదలుగానూ అంతర్జాతీయ ప్రమాణాల ప్రాతిపదికన లెక్క తేలినట్లు ప్లానింగ్ కమిషన్ తెలిపింది. అంటే భారతదేశంలో నూటికి 80 మంది 2 డాలర్ల సంపాదనతో బతుకులు వెళ్ళ దీస్తున్నారు. భారతదేశంలో జరిగిన వివిధ అధ్యయనాలు కనీస జీవనానికి రూ.40000 (నలభై వేలు) నుండి రూ.60000 (అరవై వేలు) వరకూ అవసరమని నిర్దారించాయని ప్రణాళికా సంఘం పత్రం ద్వారా తెలుస్తోంది. నిజానికి పెరుగుతున్న ధరలు, వాతావరణ కాలుష్యం వలన ఎదురౌతున్న జబ్బుల నుండి రక్షణ, చదువుల ఖరీదు ఇవన్నీ కలిపితే వారి అంచనాలు కూడా సరిపోవు. ఈ పరిస్థితుల్లో భారత దేశంలో దరిద్రుల నిర్మూలన జరుగుతుంది తప్ప దారిద్ర్య నిర్మూలన మాత్రం జరగదు. 

మనం సమరస భారతాన్ని ఒకరికి మరొకరు సహకారమిచ్చుకొంటూ నిర్మించుకోవాలి, రామరాజ్య నిర్మాణంలో విద్వేష పూరిత అసమానతలు ఆధారంగా కాదని ప్రతి వ్యక్తి తన కళను సాకారం చేసుకొనే అవకాశాన్ని ప్రభుత్వాలు కల్పించాలనే నిజాన్ని తెలియపరచాలి. అసలైన అవకాశ కల్పనను నిర్లక్ష్యం చేసి, వోట్ల కోసం పేదలను ఉపయోగించుకోవడం నాగరిక సమాజానికి సిగ్గుచేటు. దారిద్ర్యం తొలగిస్తామనే పేరుతో అనేక రకాల పథకాలతో వర్గాల మధ్య చిచ్చు పెట్టే శక్తులు తమ రాజకీయ ప్రయోజనాలను సాధించుకొంటున్నాయి. కాని ఈ పథకాల వల్ల పేదలకు, నిరుపేదలకు ఏమాత్రం ఉపయోగం లేదని ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లు నిరూపించాయి. 

చదువుల వ్యాపారం - యువత 
మనదేశం 4.06 ట్రిలియన్ డాలర్ల జిడిపితో అమెరికా, చైనా వంటి అగ్ర రాజ్యాల జిడిపితో పోటీపడే విధంగా ఉంది. అలాగే సంవత్సరానికి 7, 8 శాతం అభివృద్ధితో అగ్రదేశాల  జిడిపిని కూడా అధిగమించడం కష్టమైన విషయమేమీ కాదు. చాలామంది ఆర్ధిక వేత్తలు  జిడిపి కొలతలు చూసి మనలను మార్కెట్ లా చూస్తున్నారు. కాని నిత్య అవసరాల అభివృద్ధి తక్షణ అవసరమున్న సమాజంగా చూడకపోవడం శోచనీయం.

ఒక వైపున కే.పి.సింగ్, డి.ఎల్.ఎఫ్.చైర్మన్ లాంటి వారు తమ పుట్టినరోజును వంద కోట్లకు పైగా ఖర్చు పెట్టి జరుపుకుంటున్న వారిని, మరోవైపు ఇల్లు, తిండి లేక బాధలు పడుతూ కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న వారిని చూస్తున్నాం. స్వాతంత్ర్యం తరువాత మన దేశాన్ని దోచుకుతినే మేధావులను తయారు చేశామే కాని, మాతృదేశ ఉన్నతి గురించి తపించి పని చేయగల యువకులను తయారు చేయడంలో వెనుకపడే ఉన్నాం.

ఒకప్రక్క సత్యం రామలింగరాజు, హర్షద్ మెహతా, రాజా, గాలి వంటి బాగా చదువుకొన్నవారు కోట్లకు పైగా కుంభకోణాలు చేస్తూ, తప్పుడు పద్ధతులతో సాటి ప్రజలను మోసం చేసేందుకు తమ తెలివి తేటలను వాడుకొన్న ఉదాహరణలు, మరోప్రక్క దారిలో దొరికిన లక్షల రూపాయలను చదువురాని సామాన్యులు నిజాయితీతో అప్పగించిన సందర్భాలు చూస్తే, మన చదువులు సామాజిక సంస్కారాలనివ్వడంలో విఫలమయ్యాయని అర్ధమౌతోంది. 


1950లో తయారైన భారతదేశం యొక్క ఉన్నత విద్య విధానం వలన ముఖ్యంగా టెక్నాలజీ అండ్ సైన్సెస్ లో, ఐఐటి సృష్టి,  ఐఐఎమ్ లు, సైన్సు పా
ఠశాలలు, ఆధునిక శిక్షణ మరియు పరిశోధనా సంస్థలు మన దేశంలో మంచి ఫలితాల నిచ్చాయి. స్వాతంత్ర్యం తరువాత ఇప్పటివరకు 1,40,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు చదువుకొని బయటికి రాగా, వారిలో ఇప్పటివరకు 55,000 కు పైగా అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వెళ్ళారు. వీరి వలన అమెరికా మార్కెట్ మూలధనీకరణలో $80 బిలియన్ సృష్టించే క్రెడిట్ ని పొందినట్లు అంచనా. ఇలా మన దేశంలో తయారయిన మేధావులు ప్రపంచ మానవాళికి ఉపయోగపడటం సంతోషమైనా, వందల కోట్ల ప్రజల కడగండ్లు తీర్చడానికి ఈ మేధస్సు వినియోగించి ఉంటే భారతం బాగుపడేదని మేధోవలసలను గమనించిన వారి అంచనా. కంప్యూటర్ వల్ల ప్రపంచానికి మన శక్తియుక్తులు తెలిశాయి. భారతీయులంటే లేచి గౌరవమిచ్చే స్థాయికి ఈ అరవై నాలుగు ఏళ్ళలో మనం చేరుకున్నాం. మనం సాఫ్ట్ వేర్ లో అభివృద్ధి చెందామంటున్నా, టీసిఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి అవుట్ సోర్సింగ్ కంపెనీలు డాలర్ల రేట్లలో తేడాల ఆధారంగా నడిపే వ్యాపారమే మనకు గొప్పగా కనిపించడం శోచనీయం. మైక్రోసాఫ్ట్, హ్యూలెట్ ప్యాకార్డ్, యాహూ, గూగుల్, ఫేస్ బుక్ వంటి అనేక కంపెనీలు యూనివర్శిటీ విద్యార్ధులచే స్థాపించబడి నేడు గొప్పగా నడుపబడుతున్నాయి. కాని మనదేశ యువకులలో ఇటువంటి కంపెనీలను స్థాపించగలమనే ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో మన విద్యావ్యవస్థ విఫలమైంది. ఇప్పటికీ డిగ్రీ చేతికొచ్చాక నేను ఉద్యోగం సంపాదించగలను అని ధైర్యంగా చెప్పే యువత ఇరవై శాతం మాత్రమే ఉండడం బాధాకరం. ప్రపంచంలో అత్యధిక యువత కలిగిన దేశంగా చెప్పుకొంటున్న మనదేశంలోని యువకులు ప్రతిరోజూ ఆత్మహత్యలకు పాల్పడడం ఇందుకు నిదర్శనం.

సాఫ్ట్ వేర్ తో పాటుగా, ఆయుర్వేదాన్ని కూడా ప్రపంచానికి పరిచయం చేసి, సనాతన విలువలను ప్రపంచానికి కొత్తకోణంలో ఆవిష్కరించేందుకు వేలమంది యువకులు ప్రయత్నాలు చేయడం ఈ అరవై నాలుగు ఏళ్ళలో కలిగిన పెద్ద మార్పు.

సెక్యులరిజం పేరుతో విద్యలో జీవిత విలువలను పెంపొందించే భగవద్గీతను, అనేక ధార్మిక గ్రంథాలను మన యువకులకు పరిచయం చేయకపోవడం ఒక లోపంగా నేటి మానసిక శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు. క్రికెట్ లో బెట్టింగ్ లు, టీట్వంటీని వ్యాపారంగా మార్చడం, అలాగే కబడ్డీ, ఫుట్ బాల్ వంటి జట్టుగా ఆడే ఆటలను మనం మరచిపోవడం అనే స్థితికి ఈ 64 ఏళ్ళ స్వతంత్ర పాలన ఉపయోగపడింది.
 

జగద్గురువుగా మన్ననలందుకున్న మన దేశం చదువులకోసం విదేశాలపై ఆధారపడడం మరో క్రొత్త ప్రామాణికత. మన యువత పాలకులు తమకు దూరం చేసిన స్వప్నాలను, నిజాలను నెమ్మదిగా తెలుసుకొంటున్నారు. వారు త్వరలోనే తమ లక్ష్యం చేరుకొంటారని ఆశిద్దాం. 

స్వేచ్చానువాదం - జి.ఎల్.యెన్.
__________________________________________________________________________

గతానుగతం

విశ్వాసులూ, అవిశ్వాసులూ
- రామచంద్ర గుహ

కమ్యూనిస్టు పార్టీ నుంచి వైదొలిగిన విఖ్యాత మేధావుల ఆత్మకథనాల సంపుటి 'విఫలమైన వేలుపు' (ది గాడ్ దట్ ఫెయిల్డ్). మేధా శిఖరాల నుంచి కమ్యూనిజంలోకి దూకి, ఈ ప్రపంచాన్ని మార్చాలని ఆరాటపడి, లక్ష్యసాధనకు అంకితమై, వాస్తవాలను తట్టుకోలేక అంతిమంగా ఆ భావజాలాన్ని త్యజించిన ఆర్థర్ కోస్లర్, ఇగ్నాజియో సైలోన్, లూయీ ఫిషర్ మొదలైన ధీమంతుల గ్రంథమది.

1980ల్లో, మార్క్సిజం ప్రభావం నుంచి బయటపడుతున్న దశలో నేను ఆ గ్రంథాన్ని చదివాను. తదేక దీక్షతో చదివించిన ఆత్మ (వైఫల్యాల) కథనాలవి. ఒక వాదాన్ని ప్రగాఢంగా విశ్వసించిన వారే ఆ వాదంలోని లొసుగులను లోతుగా చూడగల విమర్శకులుగా పరిణమించడం కద్దు. ఒకప్పుడు క్రైస్తవ మతాచార్యత్వాన్ని ఆకాంక్షించిన వారు కావడం వల్లే టెర్రీ ఇయగ్లెటన్, జే మ్స్ కరోల్ లాంటివారు ఆ తరువాత కేథలిక్ చర్చ్ గురించి నిశిత గ్రంథాలు వెలువరించారు. ఇప్పుడు మాజీ జిహాదీలు పలువురు తమ స్వీయానుభవాలను ప్రపంచానికి వెల్లడిస్తున్నారు.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సభ్యుని జ్ఞాపకాల గ్రంథం నొకదాన్ని ఇటీవల నేను చదవడం జరిగింది. ఆర్థికవేత్త ఎస్.హెచ్. దేశ్‌పాండే (1928-2010) ఆ పుస్తకాన్ని 1970 వ దశకంలో మరాఠీలో రాశారు. దరిమిలా అది 'క్వెస్ట్' అనే జర్నల్‌లో 'మై డేస్ ఇన్ ది ఆరెస్సెస్' అనే శీర్షికతో ప్రచురితమయింది.

దేశ్‌పాండే 1925లో, పూనాకు ముప్పై మైళ్ళ దూరంలో ఉన్న ఒక గ్రామంలో జన్మించారు. 1938లో విద్యాభ్యాసానికి పూనాకు వెళ్ళారు; ఆ తరువాత కొద్ది కాలానికే ఆయన ఆరెస్సె స్‌లో చేరారు. తన శిక్షణ తొలి రోజుల్లో ప్రముఖ మరాఠీ సాహితీవేత్త పి.జి.సహస్రబుద్ధె ప్రసంగాలకు దేశ్‌పాండే అమితాసక్తితో హాజరయ్యేవారు. సంఘ్ కార్యకర్తల నిబద్ధతకు ముగ్ధుడైన ఆ సాహితీవేత్త, 'పెట్టుబడిదారీ విధానం', 'సామ్యవాదం', 'ఫాసిజం' మొదలైన అంశాలపై ఉపన్యాసాలు ఇస్తుండేవారు.

అయితే ఈ ప్రయోగం అనతికాలంలోనే నిలిచిపోయింది. ప్రసంగ అంశంపై స్వేచ్ఛాయుత చర్చకు అవకాశం లేకపోవడంతో ఆ నిస్సార మేధా వాతావరణంలో ఆ సాహితీవేత్త ఇమడలేకపోయారు. సంస్థ అధినేతకు సంపూర్ణ విధేయత చూపాలనేది ఆరెస్సెస్ సిద్ధాంతం. సంఘ్‌లోని మేధా వ్యతిరేక వాతావరణం అంతకంతకూ అనుభవంలోకి రావడంతో ఆ సాహితీవేత్త ఆరెస్సెస్ పట్ల భ్రమలన్నిటినీ కోల్పోయారు.

శాఖ (ఆరెస్సెస్ ప్రాథమిక విభాగం) జీవితంలో కవాతు, వ్యాయామం మొదలైన భౌతిక కార్యకలాపాలకే ప్రాధాన్యం. ఉదయం పూట వ్యాయామాన్ని గ్రామీణ మహారాష్ట్ర సంప్రదాయక నృత్యాలతో దేశ్‌పాండే పోల్చారు. 'సంఘ్ వ్యాయామ విన్యాసాలు కేవలం ఒక కవాతు లాంటిదికాక, గ్రామీణ సంప్రదాయక నృత్యాలు మైమరిపించే అనుభవాలని' ఆయన అంటారు. దేశ్ పాండే ఇంకా ఇలా అన్నారు: 'ఆరెస్సెస్ లెజిమ్ (మహారాష్ట్ర జానపద నృత్యంపేరు) చాలా యాంత్రికంగా ఉంటుంది; అందులో చురుకుదనం ఉన్నప్పటికీ పారవశ్యం పొందే గుణం లేదు'.

'ఆరెస్సెస్ శిబిర జీవితంలో ఒక ప్రముఖ అంశం -శత్రువు దాడిని సూచిస్తూ అర్ధరాత్రి పూట మోగే హెచ్చరిక గంట. ఆ గంట మోగిన వెన్వెంటనే నిద్ర నుంచి లేచి రెండు నిమిషాల్లో యూనిఫామ్ ధరించి కవాతు మైదానానికి వెళ్ళాలి. ఆ హెచ్చరిక గంట చాలా భయం గొల్పేదిగా ఉండేది. లేవండి, వెంటనే లేవండి, శిబిరమంతటా మంటలు అలుముకొంటున్నాయని మీ చెవుల్లో అరుస్తున్నట్టుగా ఉంటుందా హెచ్చరిక' అని దేశ్ పాండే రాశారు. విదేశీ పాలకులను పారద్రోలడానికి పోరాడుతున్న విప్లవ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని శిక్షణా తరగతులలో చెప్పేవారని దేశ్‌పాండే పేర్కొన్నారు.

అయితే 1942లో క్విట్ ఇండియా ఉద్యమం ప్రజ్వరిల్లినప్పుడు ఆరెస్సెస్ శ్రేణులు నిష్క్రియాత్మక ప్రేక్షక జనంగా మిగిలిపోవడం దేశ్‌పాండేని అమితంగా ఆశ్చర్యపరిచింది. విదేశీ పాలనను కూలదోయగల శక్తి సామర్థ్యాలు ఇంకా ఆరెస్సెస్‌కుగాని, దేశ ప్రజలకు గాని లేవని ఆ ఏకాకి తనాన్ని సైద్ధాంతిక తరగతులు ఒక దానిలో సమర్థించారని ఆయన చెప్పారు. వీధులలో పోలీసు కాల్పుల్లో పారుతున్న రక్తమంతా వృధాయేనని ఆ వక్త చెప్పారని దేశ్‌పాండే రాశారు.

చాలా సంవత్సరాల అనంతరం సంఘ్‌లో తన అనుభవాల గురించి రాస్తూ దేశ్ పాండే ఇలా అన్నారు: 'తన అనుయాయులలో సమైక్యత, సోదర భావాన్ని సృష్టించడమే ఆరెస్సెస్ సాధించిన ప్రధాన విజయం. ఆ సోదర భావన హిందువులకే పరిమితమైనదన్న మాట నిజమే. ఆ సంస్థ మూలాలు మహారాష్ట్రలో ఉన్నాయన్న వాస్తవాన్ని విస్మరించకూడదు. అయినప్పటికీ ఆరెస్సెస్‌లో మచ్చుకైనా సంకుచిత మహారాష్ట్రియన్ అభిమానాలు కన్పించవు. సంఘ్ కార్యకర్తల్లో, వారు తమిళులైనా, బెంగాలీలైనా, మహారాష్ట్రియన్‌లైనా, పంజాబీలైనా అందరిమధ్య గొప్ప సౌభ్రాతృత్వం వెల్లివిరియడం చాలా గొప్ప విష యం'.

ఇక ఆరెస్సెస్ కార్యకలాపాల్లో 'రెండో రకం మేధా చర్చలకు సైతం చోటు లే దు'. సంఘ్ మేధా వ్యతిరేక వైఖరుల కారణంగానే సైద్ధాంతిక తరగతులు అని పిలవబడే సమావేశాల్లో వెలువరించే ప్రసంగాలు నిస్సారంగా ఉండేవని దేశ్‌పాండే రాశారు. సదరు వక్తల ను విద్వత్తును బట్టిగాక సంఘ్ నాయకత్వ శ్రేణిలో వారి స్థానా న్ని బట్టి ఎంపిక చేసేవారు. సంస్థ పట్ల అభిమానపూర్వకంగా చెప్పే విషయాలను కనీసం భరించగలిగేవాళ్ళం. అయితే తమ వాదనలకు సైద్ధాంతిక ప్రాతిపదికలను కల్పించడానికి ప్రయత్ని ంచినప్పుడు వక్తల అసలు వైఖరి బయటపడేది. 'హిందువులదే హిందుస్థాన్', 'కాషాయ పతాకమే మన జాతీయ పతాకం',. 'ఒక జాతి, ఒక నాయకుడు అనే గతానుగతిక మాటలను విసుగు కలిగించే విధంగా పదే పదే వారు వాడుతుండేవారు'.

ఇటీవలి సంవత్సరాలలో సంఘ్ పరివార్ గురించి భారతీయ, పాశ్చాత్య విద్యావేత్తలు పలువురు నిశిత పరిశోధనా గ్రంథాలెన్నిటినో వెలువరించారు. వాటిలో అత్యుత్తమమైనది-నా అభిప్రాయంలో - రచయిత, చరిత్రకారుడు డి.ఆర్. గోయల్ రాసిన 'రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్'. దేశ్‌పాండే వలే ఈయన కూడా ఒకప్పుడు స్వయం సేవకుడే. సంఘ్ భావజాలాన్ని ఆయన ఇలా సంక్షేపించారు: 'చరిత్రకు అందని కాలం నుంచీ హిందువులు భారతదేశంలో నివశిస్తున్నారు. హిందువులు ఒక జాతి.

తమ సంస్కృతీ నాగరికతలను పూర్తిగా వారే స్వయంగా నిర్మించుకున్నారు. హిందువేతరులు దురాక్రమణదారులు లేదా అతిథులు. వారిని హిందువులతో సమానంగా పరిగణించడం సమంజసం కాదు... విదేశీయుల దాడుల నుంచి తమ మతం, సంస్కృతిని కాపాడుకోవడానికి హిందువులు చేసిన పోరాటాల చరిత్రే భారతదేశ చరిత్ర. ఈ జాతి హిందూ జాతి అని విశ్వసించని వారి చేతుల్లో అధికారం ఉన్నందున విదేశీ దాడుల ముప్పు ఇంకా కొనసాగుతోంది.

ఈ దేశంలో నివశిస్తున్న వారి మధ్య సమైక్యతే జాతి ఐక్యత అని మాట్లాడుతున్న వారు స్వార్థపరులు; మైనారిటీల ఓట్లను దృష్టిలో ఉంచుకొనే అలా మాట్లాడుతున్నారు. కనుక దేశద్రోహులు. నలువైపులా శత్రువు లు ఉన్నందున హిందువులందరూ ఏకమవ్వాల్సిన అవసరమెంతైనా ఉంది. శత్రువుపై పెద్ద ఎత్తున దాడిచేయగల శక్తిసామర్థ్యాలను పెంపొందించుకోవాలి. ముందుగా శత్రువుపై దాడిచేయడమే సరైన ఆత్మరక్షణ విధానమని భావించాలి. హిందువులందరినీ ఏకం చేసే మహోన్నత లక్ష్యానికే సంఘ్ ఆవిర్భవించింది'.

ఈ సారాంశాన్ని ఇచ్చిన అనంతరం డి.ఆర్.గోయల్ ఇలా వ్యాఖ్యానించారు: 'తన 74 సంవత్సరాల చరిత్రలో ఆరెస్సెస్ శాఖల సమావేశాల్లో ఇంతకుమించి మరేమీ బోధించలేదనే సత్యాన్ని ఉల్లంఘిస్తున్నామనే భయం లేకుండా చెప్పవచ్చు'. గోయల్, ఇది రాసింది 1999లో. అయితే గత పదమూడు సంవత్సరాలలోనూ ఇంతకు మించి మరేమీ చెప్పలేదు.

(ఆంధ్రజ్యోతికి ప్రత్యేకం)

Tuesday, January 24, 2012

మంచి నాయకత్వం ప్రపంచంలో ఎక్కడైనా అభివృద్ధి సాధించగలదు__అబ్దుల్ కలాం

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వ్యాఖ్య 

పుస్తకాన్ని విడుదల చేస్తున్న అబ్దుల్ కలాం, నరేంద్ర మోడి

ఈ మధ్య మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గుజరాత్ లో జరిగిన ఒక కార్యక్రమంలో "పాలన - ప్రజా సేవ" అంశంపై ఉపన్యసించారు. ప్రపంచంలో ఏ దేశంలో నైనా మంచి నాయకత్వం ఉంటే ఆ దేశం అభివృద్ధి సాధించగలదు, అలాగే సమస్యలను ఎదుర్కొనటానికి, పరిష్కరించేందుకు ధైర్యంగా సిద్ధపడుతుంది. గతంలో పనిచేసిన పి.వి.నరసింహారావు, అటల్ బిహారీ వాజ్ పాయ్ సరియైన నాయకత్వం వహించారు, అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకోవటానికి వెనకాడలేదు. దానితో దేశంలో, అంతర్జాతీయంగా ప్రాముఖ్యతను సంపాదించుకొన్నారు.

గుజరాత్ లో నరేంద్ర మోడి కూడా రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసము సరియైన ప్రణాళికలు రచించటమే  కాదు, వాటిని అమలు చేస్తున్నారు. ఈ మధ్య గుజరాత్ ప్రభుత్వం "గ్రామాలకు వ్యవసాయ సంబంధమైన సరియైన సమాచారము అందించటం, వ్యవసాయ భూములను పరిశీలించటం, భూసారమును ఆరోగ్యవంతంగా ఉంచటానికి తీసుకోవలసిన జాగ్రత్తలు, సేంద్రియ వ్యవసాయము మొదలైన అంశాలను పరిశీలించి తగు సూచనలు చేయటం ఒక ఉద్యమంగా తీసుకొంది. "కృషి మహోత్సవం" పేరుతొ తీసుకొన్న ఈ కార్యక్రమం రాష్ట్రంలోని 18000 గ్రామాలకు పాలనా యంత్రాంగము, సుమారు లక్షమంది ఉద్యోగస్తులు గ్రామాలకు కదిలారు. ముఖ్యమంత్రి నుండి వ్యవసాయ శాస్త్రవేత్తలు,  తాలూకా స్థాయి ఉద్యోగస్తులందరూ కదిలారు. ఇది ప్రభుత్వం యొక్క పటిష్ట పాలనకు గుర్తింపు. గుజరాత్ ప్రభుత్వం e - పాలనకూడా ప్రవేశపెట్టింది. అన్ని స్థాయిలలో పారదర్శకమైన పాలనకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవటానికి అది ఉపయోగపడుతున్నది. ఈ దేశంలో సి.సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్.స్వామినాధన్, బి.శివరామన్, ఆకుపచ్చ విప్లవం సృష్టించారు. డిల్లీ మెట్రో చీఫ్ బి.శ్రీధరన్ లాంటి అనేకమంది వాళ్ళ క్షేత్రంలో సరియైన నాయకత్వం అందించారు" అని అబ్దుల్ కలాం కొనియాడారు.

 

--------------------------------------------------------------------------------------------------------------

Ancient Hindu Technology stuns world: Thousand year old Shiva Statue in solid bronze


Amsterdam, January 16: It was a complete surprise for the conservators and curators of Amsterdam’s Rijks Museum as they witnessed that the Shiva Nataraj statue was in solid bronze and also the aureole and the demon under Shiva’s feet are also solid.

This Dancing Shiva statue was X-rayed using high-energy digital radiation, along with the lorry transporting it, in the most powerful X-ray tunnel for containers of the Rotterdam customs authority, normally used to scan sea containers for suspicious contents. It is said to be the first research of its kind on a museological masterpiece.

At 153 cm x 114.5 cm, the Rijksmuseum’s Shiva is the largest known bronze statue from the Chola Dynasty (9th to 12th century) kept in a museological collection outside of India. Given its weight (300 kg), the statue has always been suspected of not being hollow, as has been common practice in Europe since the Greek Antiquity.



As part of an earlier investigation, an X-ray was taken of the statue in a Rijksmuseum gallery in 1999 while visitors were evacuated as a precaution against radiation. Unfortunately, the equipment used at the time (280 KeV) was not powerful enough to determine anything definitively. The Rotterdam X-ray tunnel of the Rotterdam customs authority offered a solution.

Hindu statesman Rajan Zed has applauded Rijksmuseum for its interest in Hindu artifacts. Zed, who is President of Universal Society of Hinduism, in a statement in Nevada (USA), urged the major museums of world to acquire more Hindu sculpture and art; dedicate permanent space to Hindu artifacts; and organize more exhibitions of Hindu art, sculptures, and architecture to make aware the present and future generations about their richness.

Rajan Zed argued that because of their richness and other factors, Hindu artifacts were becoming favorite of museums in America and the West. Many prestigious museums already owned Hindu sculptures and other artifacts and many were planning to acquire.

The Rijksmuseum renovation project has provided conservators and curators the opportunity to carry out in-depth research on special pieces from the Rijksmuseum collection, including this masterpiece from the Asian Art Collection. The statue was created ca. 1100 in South India. Each temple had its own set of bronze statues which were carried through the city during major temple festivals. This gives the statues their name: utsavamurti, which is Sanskrit for ‘festival images’. Chola bronzes were considered masterpieces of Indian bronze casting.

The sculpture can be seen as evidence that India has a glorious heritage of science and technology which is superior but unknown for the current World. Essentially Western world and Westernized Indians internalized colonial stereotypes that India was less rational and scientific than the West, India was world negating in its outlook, frozen in time and unable to advance without help from foreign invaders, India's civilization was mainly imported via invaders, except for its problems such as caste that were its own 'essences' and Indian society was socially backward hence dependent upon Westernization to reform its current problems. Recent revelation indicates that Hindu civilization was a master of all skilled crafts and also the craft of life.

Anna Ślączka, curator of South Asian Art, comments, ‘We had expected that the statue itself would prove to be solid, but it was a complete surprise to discover that the aureole and the demon under Shiva’s feet are also solid.’

The 12th-century Shiva Nataraja is on loan from the Vereniging van Vrienden der Aziatische Kunst (Association of Friends of Asian Art).

The appointment of the curator of South Asian Art, Anna Ślączka, was sponsored by Staal aan Zee, Tata Steel B.V., a named fund of the Rijksmuseum.

Courtesy : News Bharati
_________________________________________________________________________________

ఇండియా గేట్

అవినీతే రాజనీతి
- ఎ.కృష్ణారావు

పార్లమెంట్ సభ్యులను ఎప్పుడు చూసినా కేంద్ర మంత్రులను కలిసేందుకు ఏదో ఒక ప్రజా సమస్యను నివేదించేందుకు లెటర్ హెడ్‌లపై తోటి ఎంపిలతో సంతకాలు సేకరిస్తూ కనపడతారు. కాని నిజానికి ఎంపిలందరూ కేంద్ర మంత్రులను కేవలం ప్రజాసమస్యలపైనే కలుస్తున్నారా? గత సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని కొందరు పార్లమెంట్ సభ్యులు ఒక ప్రజాసమస్యపై కలుసుకున్నారు. ఈ సమావేశం పూర్తి కాగానే ఇద్దరు ఎంపిలు మాత్రం తాము వ్యక్తిగతంగా ఆయనతో మాట్లాడాలంటూ ఉండిపోయారు.

ఈ ఇద్దరు ఎంపిలకు వ్యాపార ప్రయోజనాలున్నాయి. ఈ ఇద్దరు ఏమి మాట్లాడి ఉంటారో ఊహించాల్సిందే. అటు వారు కానీ, ప్రణబ్ కానీ ఆ విషయం బయటకు చెప్పే అవకాశం లేదు. జైరాం రమేశ్ కేంద్ర పర్యావరణ మంత్రిగా ఉన్నప్పుడు ఈ విషయంపై లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీలకు లేఖ రాసి సంచలనం సృష్టించారు. అనేక మంది పార్లమెంట్ సభ్యులు తమ నియోజకవర్గాల పరిధిలో లేని ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల గురించి లాబీయింగ్ చేస్తున్నారని, తనపై ఒత్తిడి తెస్తున్నారని, తమ కంపెనీల తరఫున పైరవీలు చేస్తున్నారని ఆయన ఈ లేఖ రాశారు.

ఇలా చేయడం నైతిక నిబంధనలకు విరుద్ధమని తాను పలు సార్లు చెప్పానని, అయినా వారు వినడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జై రాం రమేశ్ రాసిన ఈ లేఖను ఉభయ సభల అధ్యక్షులు తమ తమ ఎథిక్స్ కమిటీ చైర్మన్‌లకు పంపారు. దానిపై పార్టీలో రచ్చ జరగడంతో ఆయన తన ఆరోపణలను వెనక్కు తీసుకోవల్సి వ చ్చింది. కాంగ్రెస్‌తో పాటు ఏ పార్టీ తాను ఎక్కిన కొమ్మను తానే నరుక్కునే ప్రయత్నం చేయదు కదా? ఆ తర్వాత పార్లమెంట్‌లోనూ, బయటా ఎంపిల లాబీయింగ్‌లు సాగుతూనే ఉన్నాయి.

జైరాం రమేశ్‌ను మాత్రం పర్యావరణ శాఖనుంచి గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖకు బదిలీ చేశారు. మీ ఎంపి ఏమిటి? ఎప్పుడు చూసినా పైరవీలతో మంత్రుల చుట్టూ తిరుగుతుంటారు? అని కొందరు మన రాష్ట్ర్ర ఎంపిల గురించి అడిగే వారు ఎప్పుడూ తారసిల్లుతూనే ఉంటారు. వ్యాపారవేత్తలుగా ఉన్న మన రాష్ట్ర ఎంపిలతో పాటు చాలా మంది ఎంపిలు పార్లమెంట్‌కు చెందిన అత్యంత కీలకమైన ఆర్థిక కమిటీల్లో సభ్యత్వాన్ని పొందుతారు. తద్వారా అనేక ప్రభుత్వ రంగ సంస్థల, విభాగాల, బ్యాంకుల అధిపతులు, అధికారులతో సంబంధాలను ఏర్పర్చుకోవడమే కాక, తమ అధికారాన్ని ఉపయోగించి పనులు చేయించుకునే అవకాశాలున్నాయి.

నాకు ఫలానా కంపెనీలో వాటాలున్నాయి. కనుక ఆ కేసును విచారించను.. అని ఆ కేసునుంచి తప్పుకున్న న్యాయమూర్తులు ఉన్నారు. న్యాయమూర్తులు తమ ఆస్తులను కూడా ప్రకటిస్తున్నారు. వారు జవాబుదారీగా ఉండాలనే ఉద్దేశంతో అందుకు సంబంధించిన బిల్లు కూడా పార్లమెంట్ ముందుకు వచ్చింది. అయితే ఎంపిలకు మాత్రం ఇలాంటి జవాబు దారీ ఏమీ లేదు. తమ వ్యాపార ప్రయోజనాలకు తమ పార్లమెంట్ సభ్యత్వాన్ని ఉపయోగించుకుంటున్న వారెందరో ఉన్నారు. అంటే వారు న్యాయమూర్తుల కన్నా ఘనులా? రోజురోజుకూ పార్లమెంట్‌లో ప్రవేశిస్తున్న వ్యాపారుల సంఖ్య ఎక్కువవుతోంది.

ఈ వ్యాపారులు ఎందుకు పార్లమెంట్‌పై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు? కేవలం ప్రజాసేవకోసమేనా? లేక తమ వ్యాపారాలను, ఆస్తులను విస్తరించడం కోసమా? వ్యాపారవేత్తలకు ఎంపిలు కాకముందున్న ఆస్తి, అయిన తర్వాత సంపాదించిన ఆస్తి గురించి లెక్కలేమన్నా ఉన్నాయా? పార్లమెంట్ సభ్యులైన తర్వాత వ్యాపారాలు ప్రారంభించి ఆస్తులు పెంచుకున్న వారి గురించి చిట్టా ఏమైనా ఉన్నదా? చట్ట ప్రకారం వారు ప్రజాసేవకులే కనుక అధికార దుర్వినియోగం క్రింద, ఆదాయానికి మించిన ఆస్తులున్నందుకు చర్యలు తీసుకునే అవకాశం లేదా?

చాలా దేశాల్లో ఎంపిలు తమ వ్యాపార ప్రయోజనాలను తెలిపిన తర్వాత దానికి సంబంధించిన రిజిస్టర్‌ను సభాధ్యక్షులు నిర్వహిస్తారు. రాజ్యసభలో అలాంటి రిజిస్టర్ ఉంది కాని లోక్‌సభలో లేదు. తమ వ్యాపార ప్రయోజనాలకు ఉపయోగపడే కమిటీల్లో ఉన్న కొందరు రాజ్యసభ ఎంపిల గురించి ఈ రిజిస్టర్‌లో వివరాలున్నాయి కాని వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దాదాపు 92 మంది రాజ్యసభ ఎంపిలు తమ వ్యాపార ప్రయోజనాల గురించి వెల్లడించారు.

లోక్‌సభకు సంబంధించి ప్రమాణ స్వీకారం చేసిన 90 రోజులలోగా ఎంపిలు తమ ఆస్తులను ప్రకటించాలి. కాని ఆ వివరాలను రహస్యంగా ఉంచుతున్నారు. నిజానికి ఎంపిలందరూ తమ, తమ కుటుంబ సభ్యుల వ్యాపార ప్రయోజనాలు, ఆస్తులు, ఆసక్తులు, తమ వృత్తి, కంపెనీల్లో వాటాలు, తాము వివిధ కంపెనీల్లో నిర్వహిస్తున్న పదవులు, వివిధ మార్గాల్లో ఆర్జిస్తున్న మొత్తం, ఎంపిలుగా తీసుకున్న బహుమానాలు, ఆతిథ్యాలు, కన్సల్టెన్సీల గురించి వివరించిన తర్వాత పార్లమెంట్‌ను వారు తమ ప్రయోజనాలకు వాడుకోకుండా తప్పనిసరిగా చర్యలు తీసుకునే యంత్రాంగాన్ని ఏర్పర్చాలి.

ముందు జాగ్రత్త చర్యగా వారు ఆర్థిక ప్రయోజనాలు పొందే కమిటీల్లో వారికి సభ్యత్వం ఇవ్వకుండా చూడవచ్చు. అంతేకాదు, తమ కంపెనీల ప్రయోజనాలకు అనుగుణంగా పార్లమెంట్ ఓటు వేసినా, ప్రసంగించినా చర్య తీసుకునే అవకాశం ఉండాలి. ఈ వివరాలన్నీ ప్రజలకు తెలియాలి. లేకపోతే ఎలాంటి ప్రజాప్రతినిధులను తాము ఎన్నుకున్నామో వారెలా గ్రహిస్తారు?

రాజ్యసభలో మాదిరి లోక్‌సభలో కూడా ఎంపిలు తమ ఆర్థిక ప్రయోజనాల గురించి వివరించే రిజిస్టర్ ఏర్పాటు చేసే విషయంపై ఎథిక్స్ కమిటీ రాసిన లేఖకు అనుగుణంగా స్పీకర్ మీరాకుమార్ సానుకూలంగా స్పందించారు. మంగళవారం లోక్‌సభ ఎథిక్స్ కమిటీ చైర్మన్ మాణిక్ రావు గవిట్ ఈ విషయం చర్చించేందుకు కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ రిజిస్టర్ ఏర్పాటు విషయంపై స్పీకర్ ఆధ్వర్యంలోని రూల్స్ కమిటీ ఎలాంటి నిబంధనలను రూపొందించకపోవడంతో సమావేశాన్ని మార్చ్ నెలకు వాయిదా వేశారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ సమావేశం వాయిదా వేశామని, ఇప్పుడు ఎంపిల ఆర్థిక ప్రయోజనాలను గురించి చర్చించి రాజకీయంగా రచ్చ చేసుకోవడం దేనికని కమిటీ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు.

అయినా రిజిస్టర్ ఏర్పాటు చే సిన తర్వాత ఎంపిలు తమ ఆర్థిక ప్రయోజనాల గురించి వివరించడం తప్పనిసరి చేయకపోయినా, నైతిక నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే యంత్రాంగం ఏర్పాటు చేయకపోయినా దాని వల్ల ప్రయోజనం లేదు. పబ్లిక్స్ అండర్ టేకింగ్స్ కమిటీ చైర్మన్‌గా కిషోర్ చంద్రదేవ్ ఉన్నప్పుడు తన కమిటీ పరిశీలించే ఏ అంశంలోనైనా కమిటీ సభ్యులకు వ్యాపార ప్రయోజనాలుంటే తెలియజేయాలని అందరు ఎంపిలకు సర్క్యులర్ పంపారు. ఈ కమిటీలో మన రాష్ట్రానికి చెందిన ముగ్గురు వ్యాపారవేత్తలైన ఎంపిలు సభ్యులుగా ఉన్నారు. తమ ప్రాజెక్టులు, చెల్లింపులు ఎందుకు ఆలస్యమవుతున్నాయని వారు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ బ్రహ్మదత్‌ను ప్రశ్నించడం కిషోర్ చంద్రదేవ్ దృష్టికి వచ్చింది.

రాజకీయాలూ, నైతిక సూత్రాలకు రెండింటికీ అవినాభావ సంబంధం ఉన్నదని, రెండింటినీ వేరు చేయలేమని ఎథిక్స్ కమిటీ గురించి పార్లమెంట్ ప్రచురించే డాక్యుమెంట్లలో ఘనంగా చెప్పుకున్నారు. ప్రజాప్రతినిధులను ప్రజలు ఆదర్శంగా భావిస్తారు కనుక వారు నైతికంగా ఉత్తములై ఉండాలని ఎథిక్స్ కమిటీ ఆశిస్తోంది. నిజానికి నేర చరితులకూ, మాఫియా శక్తులకూ రాజకీయ శక్తులు ప్రోత్సాహాన్నిస్తున్నాయని మాజీ హోం సెక్రటరీ వోహ్రా ఆధ్వర్యంలో ఏర్పర్చిన కమిటీ 1995లో సమర్పించిన నివేదికను ఉభయ సభలు క్షుణ్ణంగా చర్చించిన తర్వాతనే పార్లమెంట్‌లో ఎథిక్స్ కమిటీలు ఏర్పాటు చేసింది.

మాజీ ప్రధాని చంద్రశేఖర్ చైర్మన్‌గా ఉన్న ఎథిక్స్ కమిటీ తన కారుకు నకిలీ పార్లమెంట్ లేబుల్ అంటించి పార్లమెంట్‌లోకి వచ్చి పట్టుబడ్డ ఒక ఎంపిని తీవ్రంగా అభిశంసించింది. ఓటుకోసం ముడుపులు తీసుకున్న, ఎంపి లాడ్స్ నిధులు దుర్వినియోగం చేసిన ఎంపిలపై తర్వాతి కమిటీల్లో విచారణ జరిపి చర్యలు తీసుకున్నారు.

విచిత్రమేమంటే ఎథిక్స్ కమిటీల్లో విచారణ జరిపే ఎంపిల్లో కూడా అవినీతిపరులుండడం. కామన్‌వెల్త్ క్రీడల్లో అక్రమాలకు పాల్పడ్డ సురేష్ కల్మాడీ కూడా ఎథిక్స్ కమిటీలో సభ్యుడుగా ఉన్నారు. ఆయనపై సిబిఐ ఛార్జిషీటు దాఖలు చేసిన తర్వాత కమిటీనుంచి ఉద్వాసన పలికారు. నిజానికి పార్టీలు ప్రాథమిక దశలోనే జల్లెడ బట్టి అవినీతిపరులకు, నేరస్థులకు వ్యాపారాలను పెంచుకునేందుకు రాజకీయాల్లో ప్రవేశించే వారికి సీట్లు ఇవ్వకపోతే పార్లమెంటరీ వ్యవస్థ పట్ల ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది.

కాని అలా జరిగేందుకు అవకాశం లేదు. తాజాగా జరుగుతున్న అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో పెద్ద ఎత్తున నేరచరితులు, వ్యాపారవేత్తలు, కోట్లకు పడగెత్తినవారున్నారని వివిధ సంస్థలు వెల్లడించాయి. ధన బలం, కండబలం, కులబలం ప్రధానమైన ఓటు బ్యాంకు రాజకీయ వ్యవస్థలో ప్రక్షాళన సాధ్యమవుతుందా?

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
 

Monday, January 23, 2012

Let all of us pay homage to
Netaji Subhash Chandra Bose
on his birthday……..............

Netaji Subhash Chandra Bose
On Jan 23rd 1897, a great patriot of India was born – Netaji Subhash Chandra Bose who was the greatest freedom fighter and prominent Indian Leader and who made India independent with his strategy , struggle and will power.
The contribution of Netaji Subhas Chandra Bose to India's freedom movement needs no elaboration. You will agree that the spirit of Nationalism , patriotism and sacrifice of Netaji Bose for the Nation Must be spread throughout India. Subhash bose deserves more recognition He has been denied his rightful place in the annals of Indian history.India Today needs Netaji's ideology of patriotism back so I would like to request the Indian Government to declare 23rd January as ‘Patriotism Day' in order to promote the message of national integration.

Subhas Chandra Bose was one of the most fearsome names among the British Rulers in pre-independence India. A legend and a great freedom fighter, Subhas Chandra Bose was popularly known as ‘Neta Ji (respected leader)’ because of his leadership qualities and almost religious devotion to India’s freedom struggle. Neta Ji’s entire life is punctuated with great deeds and exceptional freedom endeavours. Born on January 23, 1897 in Cuttack, Orissa, Neta Ji Subhas Chandra Bose was the ninth child of a famous lawyer Janaki Nath Bose and Prabhavati Devi. He was a brilliant student right from his childhood. He was a topper in the Matriculation examination from Calcutta province and graduated with First class. Later on, he went to England in 1919 and appeared for prestigious Indian Civil Service Examination and achieved fourth place on merit. But Jalianwalla massacre affected him deeply and he left his Civil services apprenticeship midway.

Neta ji came back to India in 1921 with a resolve to throw the British out of the country. He joined Indian National Congress and expressed his desire to serve the nation to Mahatma Gandhi. On instructions of Gandhi Ji, he joined Deshbandhu Chittaranjan das in Calcutta. He considered Deshbandhu as his political guru. Soon enough, Subhas Chandra Bose started to show his leadership skills and became a vital part of Congress party. He was an active participant in Civil Disobedience Movement in 1930 and was sent to prison for his participation. After the suspension of the movement, he was released from the prison.

Neta Ji Subhas Chandra Bose was not convinced with Mahatma Gandhi’s method of achieving independence. He firmly believed that only way to attain independence was through armed revolution and by shedding blood. He formed his own party, Independence League and later on Forward Bloc. He quit Congress in protest to liberal policies of the party and started his own movement. Neta Ji was imprisoned several times because of his various revolutionary activities.

Life of Subash Chandra Bose was truly eventful. He approached Hitler for help against the British. Neta Ji organised Indian National Army and sought the help of Japan for military assistance. He famously said, "Tum mujhe khoon do, mein tumhe azadi dunga" (Give me your blood and I will give you freedom). He hosted the Indian National Flag in Kohima, Assam and Andaman & Nicobar Islands. But the defeat of Japan and Germany in Second World War forced Indian National Army to retreat. According to official details, Subash Chandra Bose was killed in a plane crash over Taiwan while flying to Tokyo on August 17, 1945 but not much information could be found about him afterwards.
• Give me blood and I shall give you freedom!

• As soldiers, you will always have to cherish and live up to the three ideals of faithfulness, duty and sacrifice. Soldiers who always remain faithful to their nation, who are always prepared to sacrifice their lives, are invincible. If you, too, want to be invincible, engrave these three ideals in the innermost core of your hearts.

• I have no doubt in my mind that our chief national problems relating to the eradication of poverty, illiteracy and disease and the scientific production and distribution can be tackled only along socialistic lines.

• Nationalism is inspired by the highest ideals of the human race, satyam [the true], shivam [the god], sundaram [the beautiful]. Nationalism in India has ... roused the creative faculties which for centuries had been lying dormant in our people.

• Gird up your loins for the task that now lies ahead. I had asked you for men, money and materials. I have got them in generous measure. Now I demand more of you. Men, money and materials cannot by themselves bring victory or freedom. We must have the motive-power that will inspire us to brave deeds and heroic exploits.

• It is our duty to pay for our liberty with our own blood. The freedom that we shall win through our sacrifice and exertions, we shall be able to preserve with our own strength.

• No real change in history has ever been achieved by discussions.
• We should have but one desire today ? the desire to die so that India may live ? the desire to face a martyr's death, so that the path to freedom may be paved with the martyr's blood.

• One individual may die for an idea; but that idea will, after his death, incarnate itself in a thousand lives. That is how the wheel of evolution moves on and the ideas and dreams of one nation are bequeathed to the next

• Freedom is not given, it is taken


Let's Salute Our national Hero.

Happy Patriotism Day !

Jai Hind !

Sunday, January 22, 2012

 ( కాకతీయులు ఏలిన ఓరుగల్లు....సాహితీ చరితలో సువర్ణాక్షరాల పుట్టిల్లు. వరంగల్ ఓ థ్రిల్. మూడు నగరాల త్రివేణి సంగమ సమానం .( వరంగల్, హనంకొండ, కాజీపేట ) అల్లాంటి వరంగల్ ఘనత...కాలగర్భం లో కలిసిపోనుందా ? ఈ నాటి ఆంధ్ర జ్యోతి వార్త మీ కోసం. వరంగల్ గురించి మీకు తెలుసా ? కాకతీయ వైభవం, చారిత్రాత్మక కట్టడ విశిష్టత మీకు తెలిస్తే , మాకు తెలియజేయండి. ధరిత్రి లో , చరిత్రకు ఎక్కినా ఏ పుణ్య స్థలం..మరుగున పడిపోకూడదు. ఇది మా ఆకాంక్ష !!! www.manrobo.com manrobocreations@gmail.com
) కోట గర్భంలో కాకతీయ మహా నగరం!
రాజా ప్రాసాదాల అన్వేషణలో పరిశోధకులు
జాతీయ పురాతత్వ శాఖ ప్రత్యేక శ్రద్ధ
ఖిలా వరంగల్‌లో భారీగా తవ్వకాలు
వరంగల్, జనవరి 21 : అలనాటి స్వర్ణయుగ వైభవానికి ప్రతీక.. శిల్పకళా సౌందర్యానికి నిలయం.. సాహితీ వేత్తల సౌరభాలు గుబాళించిన నేల.. వెలకట్టలేని 'కోహినూర్' పుట్టినిల్లు.. కాకతీయ సామ్రాజ్యం. క్రీ.శ. 1150 నుంచి 1323 వరకు వర్ధిల్లిన కాకతీయులు తరతరాలకు చెరగని నైపుణ్యాలను అందించారు. ఓరుగల్లు రాజధానిగా పాలించిన రాజులు నిర్మించిన అనేక కట్టడాలు నేటికీ వరంగల్ జిల్లాలో దర్శనమిస్తాయి. ఇంతకీ కాకతీయ రాజులు ఎక్కడ నివసించారు? వారి రాజ ప్రసాదాలు ఏమయ్యాయి? ఖిలా వరంగల్ అంతర్భాగంలో కాకతీయ మహానగరం ఉందా? ఇలాంటి అనేక అంశాలపై పరిశోధనకు జాతీయ పురాతత్వ శాఖ సమాయత్తమైంది.

భూమిలో కప్పబడి పోయిందా?
సిరి సంపదలతో తులతూగిన కాకతీయ నగరం భూ అంతర్భాగంలో దాగి ఉండే అవకాశం ఉందని పురాతత్వ శాఖ భావిస్తోంది. అయితే మహ్మదీయ దండయాత్రల్లో శిథిలమైందా? ప్రకృతి వైపరీత్యాలతో భూమిలో కప్పబడిపోయిందా? అనే కోణాల్లో పరిశోధిస్తున్నారు. వరంగల్ కోటలో జరిపిన తవ్వకాల్లో ఇప్పటికే ఓ దేవాలయాన్ని వెలికితీశారు. ఈ కోట గర్భంలోనే చారిత్రక నగరం ఉండవచ్చని పరిశోధకుల అంచనా.

ఆనవాళ్ల కోసం ప్రయత్నాలు
వరంగల్ కోటలో కాకతీయ తోరణాలున్న ప్రాం తంలో తవ్వకాలు జరిపినా రాజుల నివాస ఆధారా లు లభించలేదు. ప్రస్తుతం తోరణాల నుంచి శంభునిగుడివరకు తవ్వనున్నారు. మరోవైపు ఖుష్ మహల్ ఎదురుగా శృంగారబావిని ఆనుకొని ఉన్న 8ఎకరాల విస్తీర్ణంలోనూ తవ్వకాలకు సిద్ధమవుతున్నారు. విశాలమైన ప్రహరీ పునాది ఈ ప్రాంతంలో ఇప్పటికీ కనిపిస్తుండగా ఇది రాజసౌధానికి సంబంధించినది కావచ్చని భావిస్తున్నారు.

రాజ ప్రాసాదం, రాణి వాసం, పరిపాలన భవనాల ఆనుపానులు గుర్తించడానికి తవ్వకాలు చేపట్టనున్నట్లు అధికారు లు చెబుతున్నారు. ఖిలా వరంగల్ ప్రాంతంపై నిరుడు నిర్వహించిన ఏడాదే శాటిలైట్ సర్వే ఆధారంగా ఇక్కడి జనాభా, నివాసాలు, ఖాళీ స్థల విస్తీర్ణం, పునరావాస వ్యయం తదితరాలపై ప్రాథమిక నివేదిక రూపొందించినట్లు సమాచారం.

నివాస ప్రాంతాలే ఆటంకం
కోట విస్తీర్ణంలో ఐదు శాతమే పురాతత్వ శాఖ అధీనంలో ఉంది. మిగిలిన ప్రాంతంలోని పడమర, తూర్పు మధ్య కోటలు గ్రామాలుగా ఏర్పడ్డాయి. ఇదంతా పురావస్తుశాఖ ఆధీనంలోకి వస్తేనే పూర్తిస్థాయిలో తవ్వకాలు జరుపవచ్చు. అయితే ఆవాసాలను ఖాళీ చేయించడం అసా ధ్యమని అధికారులు అభిప్రాయపడుతున్నారు. స్థానికులను ఒప్పించగలిగితేనే విస్తృత పరిశోధన వీలవుతుందంటున్నారు.

ప్రామాణిక గ్రంథమే లేదు..
కాకతీయ రాజులు వ్యవసాయానికి పెద్దపీట వేశారు. నీటి పారుదల రంగంలో వారి నైపుణ్యానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. గొలుసుకట్టు చెరువుల నిర్మాణం వారి దూరదృష్టికి అద్దం పడుతుంది. రామప్ప, లక్నవరం, పాకాల, భద్రకాళి, ఘనపురం చెరువులు, ఇతర జలాశయాలే ఇందుకు నిదర్శనం.

ఇంకా అనేక విశేషాల గురించి కథలుగా చెప్పుకోవడమే తప్ప వీటి గురించి ప్రామాణిక గ్రంథం ఒక్కటీ లేదు. రాష్ట్రంలోని అనేక చారిత్రక కట్టడాలపై భారతీయ పురాతత్వ సంస్థ ఒక సిరీస్‌ని ప్రచురించినా కాకతీయ సామ్రాజ్య విశేషాలు తెలిపేదంటూ ఒకటి లేకపోవడం శోచనీయం. కోటలోని శిలాశాసనాలను విశ్లేషించి కాకతీయ విజ్ఞాన సంపదను వెలికితీయాల్సి ఉంది.

ఖిలా వరంగల్‌లో జాతీయ సెమినార్
కాకతీయ చారిత్రక సంపదను వెలికితీయడంపై ప్రత్యే క శ్రద్ధ కనబరుస్తున్నట్లు పురాతత్వ శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ కన్నబాబు తెలిపారు. కాకతీయ రాజుల నివాస ప్రాంతాలను కనుగొని, వారి విశేషాలను వెలుగులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.

Tuesday, January 3, 2012

Russia court declares Hindu book Bhagvad Gita legal

Shiv Sena activists protested against Russia in Amritsar this week
A Russian court has dismissed a call to ban an edition of the Hindu holy book Bhagvad Gita, in a case that triggered protests in India. 

Prosecutors in the Siberian city of Tomsk wanted the edition to be ruled "extremist". That would put it in the same category as Hitler's Mein Kampf.

The Russian foreign ministry said it was the commentary on the text, not the text itself, that was under scrutiny. 

The edition - Bhagvad Gita As It Is - is used by the Hare Krishna movement.

A lawyer representing the movement in Tomsk, Alexander Shakhov, welcomed the judge's decision, saying it "shows that Russia really is becoming a democratic society". 

The controversial commentary on the text was written by A C Bhaktivedanta Swami Prabhupada, the founder of the movement, whose full title is the International Society for Krishna Consciousness.

Hare Krishna followers in Russia saw the case as part of efforts by the Russian Orthodox Church to restrict their activities. 

India voices concern 

The trial began in June and had been due to conclude on 19 December, but it was delayed until 28 December at the request of the Russian ombudsman for human rights. 

But neither the ombudsman Vladimir Lukin nor his Tomsk colleague Nelli Krechetova was present in court for Wednesday's ruling.

On Tuesday India's Foreign Minister, SM Krishna, complained to the Russian Ambassador to India, Alexander Kadakin, about the Tomsk prosecution. 

Mr Krishna said Indians had reacted very negatively to the alleged infringement of Hindu rights in Russia.

The Bhagvad Gita, one of the most popular texts for Hindus, takes the form of a conversation between the god Krishna and prince Arjuna. 

Earlier this month Indian MPs demanded the government protect Hindu rights in Russia, shouting: "We will not tolerate an insult to Lord Krishna."

Ambassador Kadakin, quoted by the AP news agency, distanced himself from the Tomsk prosecutors, saying "any holy scripture, whether it is the Koran, Bhagvad Gita, the Bible, Avesta or Torah cannot be brought into court". 

The Russian translation of the book was at risk of being placed on the Federal List of Extremist Materials, which bans more than 1,000 texts including Mein Kampf and publications by the Jehovah's Witness and Scientology movements.

 

_________________________________________________________________

Indian revolutionary Rajguru's Birth anniversary Aug 24, 1908




Source: GloriousInd
Shiv Ram Hari Rajguru was born in an average middle-class Hindu Brahmin family at Khed in Poona district in 1906. He came to Varanasi at a very early age where he learnt Sanskrit and read the Hindu religious scriptures. He had a good memory and learnt by heart the 'Laghu Siddhant Kaumudi'. He loved physical exercises and was associated with a number of such associations. He had great admiration for Shivaji and his guerilla tactics.

At Varanasi, he came in contact with revolutionaries. He joined the movement and became an active member of the Hindustan Socialist Republican Army (H.S.R.A). He was known in the party under the pseudonym of Raghunath. Rajguru had fearless spirit and indomitable courage. The only object of his adoration and worship was his motherland for whose liberation he considered no sacrifice too great. He was a close associate of Chandra Shekhar Azad, Sardar Bhagat Singh and Jatin Das and his field of activity was U.P and Punjab, with Kanpur, Agra and Lahore as his headquarters. Rajguru was a good shot and was regarded as the gunman of the party. He took part in various activities of the revolutionary movement, the most important being Saunder's murder. Lala Lajpat Rai, an eminent nationalist leader and popular amongst the revolutionaries, was fatally wounded in a police lathi- charge on 20 October 1928, while leading a procession against the Simon Commission, and died on 17 November 1928. The revolutionaries planned to avenge Lalaji's death by killing the Police Superintendent, Scott and the Deputy Superitendent of Police, Saunders who were responsible for the lathi charge leading to the death of Lalaji. Chandra Shekhar Azad, Shiv Ram Rajguru, Bhagat Singh and Jai Gopal were deputed for the work. On 17 December 1928, while Saunders came out of his office and started his motor- cycle, he was shot dead in front of the police headquarters at Lahore by Rajguru. Azad shot dead Channan Singh, a Head Constable, who wanted to chase the three revolutionaries. All of them escaped through the D.A.V. College compound: The same night posters of the HSRA declaring 'Saunders is dead. Lalaji is avenged' were put up throughout the city of Lahore. On 20 December, Rajguru left Lahore disguised as Bhagat Singh's servant, who travelled in a first class compartment with the wife and the young son of the revolutionary Bhagawati Charan. He left Bhagat Singh at Lucknow and went underground.

Later Bhagat Singh was arrested in the Assembly Bomb Case and several other revolutionaries were arrested with the help of approvers (Jai Gopal, Phanindra Nath and Hansraj Vohra). Rajguru was arrested at Poon on 30 September 1929 and a revolver with fourteen cartridges was recovered from a box where he was sleeping. The Government started a case against sixteen persons (including Rajguru), known as the Lahore Conspiracy Case. Judgement was delivered on 7 October 1930, Sardar Bhagat Singh, Sukhdev and Rajguru were sentenced to death and the other accused were awarded various terms of imprisonment. The whole nation was awakened and the names of Bhagat Singh, Rajguru and Sukhdev became as popular as that of Mahatma Gandhi. Meetings, processions and representations were made for commutation of their death sentence. Mahatma Gandhi and the leaders of the Indian National Congress attempted to save their lives, but they failed. An appeal to the Privy Council was alos rejected. Rajguru along with his two comrades was hanged in the Lahore jail in the evening of 23 March 1931 and their bodies were burnt under police supervision. At the time of his martyrdom, Rajguru was hardly twenty- three years of age.

The execution of the young revolutionaries was regarded as a national disaster and national mourning was observed throughout the country. The A.I.C.C session at Karachi (1931) met under gloom and passed a resolution placing on record its admiration of the bravery and sacrifice of the late Sardar Bhagat Singh and his comrades Sukhdev and Rajguru and mourning with the bereaved families the loss of these lives. The Congress is of opinion that the triple execution is an act of wanton vengeance and is a deliberate flounting of the unanmious demand of the nation for commutation.

Sunday, January 1, 2012

కొత్త ఆశలతో సరికొత్తగా...



కాలం పుటల్లోకి మరో ఏడాది ఒదిగిపోయింది. నడిచివచ్చిన దారిని ఒక్కసారి చూసుకుంటే గర్వించదగ్గ సందర్భాలే కాదు... భగ్నమైన ఆకాంక్షలు, ఛిద్రమైన ఆశలు, ఉద్విగ్నభరిత క్షణాలు, అసహాయుల ఆక్రందనలు ఉంటాయి. అసమర్థుల ప్రలాపాలు, ఆషాఢభూతుల అవకాశవాద చేష్టలు,పెత్తందార్ల బలప్రదర్శనలు దృగ్గోచరమవుతాయి. కాలం అద్దంలాంటిది. అందులో కనబడే సుందర దృశ్యమైనా, భీతిగొలిపే చిత్రమైనా, స్వర్ణయుగమైనా అది మన ప్రతిబింబమే. మనల్ని మనం తరచి చూసుకుంటేనే, చూసి సరిచేసుకుంటేనే బంగారు భవిష్యత్తుకి భరోసా ఉంటుంది. ‘నువ్వు ఆ దోవన వెళ్లదల్చుకుంటే తప్ప వెనక్కి తిరిగి చూడకు’ అని ఆస్కార్ వైల్డ్ అంటాడు గానీ, మరీ అంత నిరాశ అవసరం లేదు. కాలం అంటే తారీఖులు, వారాలు మాత్రమే కాదు. నిత్య చైతన్యంతో, నిరంతర సృజనతో తొణికిసలాడే జన సమూహాలు కూడా. కాలాన్ని జనంతో ముడివేసి చూసుకుంటేనే అర్థం, పరమార్థం.

అమెరికా చలవతో దశాబ్దాలుగా నియంతృత్వాన్ని చెలాయిస్తున్న అరబ్ నిరంకుశ అధినేతలు.. ఈయేటి జన విప్లవ జంఝామారుతంలో దూదిపింజెల్లా తేలి పోయారు. 2010 డిసెంబర్ 18న టునీసియాలో పాలకుల అవినీతిపైనా, అధిక ధరలపైనా మొదలైన నిరసనలు సోషల్ నెట్‌వర్క్ పుణ్యమా అని అరబ్ దేశాలను కార్చిచ్చులా చుట్టుముట్టాయి. వేలమందిని హతమార్చి, మరిన్నివేలమందిని చీకటికొట్టాల్లో బంధించిన ఆ దేశ అధ్యక్షుడు బెన్ అలీ జనవరి 14న ప్రజా తిరుగుబాటుతో సౌదీ అరేబియాకు పారిపోయాడు. 30 ఏళ్లుగా కరకు గూఢచార సంస్థల కనుసన్నల్లో ఈజిప్టును పీల్చిపిప్పిచేస్తున్న ఆ దేశ అధ్యక్షుడు హోస్నీ ముబారక్ సైతం జనాగ్రహానికి తలవంచకతప్పనిది ఈ ఏడాదే. ఇప్పటికీ ఆశ చావని అమెరికా అక్కడ సైనిక పాలకులతో ముబారక్ మార్కు అణచివేతను అమలు చేయిస్తున్నది. దాన్ని సైతం ఆ దేశ ప్రజలు వీధుల్లో ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇంకా యెమెన్, సూడాన్‌లు ఆ బాటలోనే ఉన్నాయి.

బహ్రెయిన్, మొరాకో, ఒమన్ ప్రజలు పోరాడుతూనే ఉన్నారు. వీరే కాదు..పతనం అంచుల్లో ఉన్న రష్యాను పట్టి నిలబెట్టి విజయపథంలోకి ఉరికించిన పుతిన్‌కు సైతం జనాగ్రహ సెగ తగులుతూనే ఉంది. రాజ్యాంగాన్ని ఏమార్చడానికి పదవులు మారుతూ దశాబ్దానికిపైగా అధికారాన్ని పర్మనెంట్ అడ్రస్‌గా చేసుకున్న పుతిన్ అంటే ఏవగింపు కలిగిందీ ఈ ఏడాదే. రాక్షసరాజు హిరణ్యకశిపుడి ఇంట పుట్టిన ప్రహ్లాదుణ్ణి తలపిస్తూ, ‘పెట్టుబడిదారీ గర్భంలోనే దాన్ని అంతంచేసే విప్లవాలు ప్రభవిస్తాయ’న్న మార్క్స్ మాటల్ని నిజం చేస్తూ కార్పొరేట్ సంస్థల స్థావర ప్రాంతం న్యూయార్క్‌లో ‘ఆక్యుపై వాల్‌స్ట్రీట్’ ఉద్యమం పురుడుపోసుకున్నది ఈ సంవత్సరమే. స్వల్ప వ్యవధిలో అది 80 దేశాలకు విస్తరించి, 750 నగరాల్లో మార్మోగడం నడుస్తున్న చరిత్ర. ఇరాన్‌ను మరో ఇరాక్‌గా మార్చడానికి అమెరికా ఎత్తులు వేస్తున్నది. దేశదేశాల్లో ద్రోన్ స్థావరాలు పెట్టుకుని కోరుకున్నచోట నిప్పులు కురిపిస్తున్నది. ఒక పక్క ఉమ్మడి కరెన్సీ అంటూనే ఉపాధి అవకాశాలను, వనరులను ఉమ్మడిగా అందనివ్వకుండా తలుపులు బిడాయించుకున్న యూరోపియన్ యూనియన్ ఈ ఏడాది కుదేలైంది. బడ్జెట్ కోతలతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న జనం ఒక దేశం తర్వాత మరో దేశంలో రోడ్డుకెక్కుతుంటే మార్కెట్లు పేకమేడల్ని తలపించాయి. 33 కోట్లమంది ఉమ్మడి ఆకాంక్షకు ప్రతీక అయిన యూరో కరుగుతున్నకొద్దీ దక్షిణ దేశాలకు వలసలు పెరిగిపోతున్నాయి.

మన దేశం విషయానికొస్తే ఇది అవినీతి నామ సంవత్సరమనదగ్గ స్థాయిలో స్కాములు బయటపడ్డాయి. ‘కూటమి ధర్మాన్ని’ నుసరించి యూపీఏ కొన్నిటిని అటకెక్కిద్దామనుకున్నా కుదరకపోవడంతో పెద్ద తలకాయలే జైలుపాలు కావలసి వచ్చింది. రోజులు గడిచేకొద్దీ 2జీ స్కాంలో ఇంకొందరు ఇంటిదొంగలు బయట పడే సూచనలు కనిపిస్తున్నాయి. వాళ్లు ఎవరెవరో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాలి. 90వ దశకంలో ఆర్థిక సంస్కరణలకు తలుపులు తెరిచి మధ్యతరగతి ఆరాధ్యుడిగా మారిన మన్మోహన్‌నే ఆ వర్గం నిలదీయటం ఈ ఏడాది సంభవించిన మరో వైచిత్రి. ఎన్నాళ్లుగానో ప్రేక్షకపాత్ర వహిస్తున్న మధ్యతరగతి వర్గం తొలిసారి వీధులకెక్కడం ఒక వింత అయితే, వారికి మారుమూల మహారాష్ట్ర పల్లె ప్రాంతానికే పరిమితమైన అన్నా హజారే నాయకత్వం వహించడం ఊహించని పరిణామం.

ఆయన బృందం రూపొందించిన జన్‌లోక్‌పాల్‌కు, ఆయన తలపెట్టిన ఉద్యమానికి పట్టణాలు, నగరాల్లో వేలకు వేలు కదిలివచ్చారు. ఫేస్‌బుక్, ట్విటర్ లాంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు లక్షోపలక్షల సందేశాలతో వెల్లువెత్తాయి. కానీ, ఆయన దాన్ని నిలుపుకొన్నట్లేనా? అర్ధంతరంగా ముగిసిన ముంబై నిరశన ఆయన స్వయంకృతమా? వీటికి జవాబులు ఇంకా లభించాల్సి ఉంది. సందట్లో సడేమియాగా ప్రధాన పార్టీలన్నీ కలిసి లోక్‌పాల్‌ను నిశిరాతిరి వేళ పార్లమెంటు సాక్షిగా నాలుగు నిలువుల లోతున పాతేశాయి. అటు యూపీఏ, ఇటు ఎన్‌డీఏ లోక్‌పాల్ చుట్టూ నడిపించిన రాజకీయంతో జాతి యావత్తూ తెల్లబోయింది.

బక్కచిక్కుతున్న రూపాయి, కుప్పకూలుతున్న మార్కెట్లు, గిట్టుబాటు లభిం చక విలవిల్లాడుతున్న రైతు, పడిపోతున్న నిజ వేతనాలు, పదిహేను రోజులకోసారి పైపైకి ఎగబాకే పెట్రో ధరలు, కొండెక్కి కూర్చుంటున్న నిత్యావసరాలు... ఇన్ని సమస్యలమధ్య కొత్త సంవత్సరం ప్రవేశిస్తున్నది. ఎవరికీ చిక్కని దొంగలా ప్రవర్తించే కాలమే... ఎందుకనో కొందరికి ఒడుపుగా అదుపులోకి వస్తుంది. అలాంటి వాళ్లనే అదృష్టవంతులంటారు గాబోలు. ఆ అదృష్టం అందరిదీ కావాలని ఆశిద్దాం. ‘అనురాగ తల్పాల మీద స్వప్నాల పుష్పాలు జల్లుకుని/ హాయిగా చల్లగా కాస్సేపు పరుండడానికి అనుమతించు తండ్రీ’ అన్న కవి తిలక్ ప్రార్థనతో ఈ నూతన సంవత్సరాగమనవేళ మనమూ గొంతు కలుపుదాం.

__________________________________

మర మనుషులం కాదుగా

సాయంత్రం 6 అవుతోంది... ఆ సభలో కూర్చున్న వారిని చూస్తే, వారిలో ఎక్కువ మంది ఒకే తరహా సామాజిక, మానసిక స్థితిలో ఉన్నట్లు ఎవరైనా సులువుగానే గుర్తిస్తారు. ఒక ప్రాంతంలోని ప్రాచీన కాలపు వృత్తి పరికరాలను సేకరించి, వాటి విశిష్ఠతలను పరిశీలించే ఒక వ్యక్తి ప్రసంగం కోసం ఏర్పాటు చేసిన సభ అది. ఉన్నత విద్యలూ, ఉన్నతోద్యోగాలు అన్నీ ఉన్న ఒక ప్రత్యేక తరగతికి చెందిన వారే ఆ సభకు ఒక్కొక్కరుగా వచ్చి చేరుకున్నారు. ఎవరికి డబ్బులకేమీ కొదవలేనట్లే అనిపించింది. కాకపోతే .....

ఎవరి ముఖంలోనూ ఆ సజీవత్వం కనిపించడం లేదు. జీవితాన్నేదో పర్వతాన్ని మోసినట్లు మోస్తూ, ఆ కుర్చీల్లో వాలిపోయారు. ఏమైతేనేం ప్రసంగం మొదలయ్యింది. ప్రాచీన వృత్తి పరికరాల విశిష్ఠతల గురించి చెబుతూ ఆ క్రమంలో ఒక నాటి వృత్తి వేళలకూ, ఈ నాటి వృత్తి వేళలకూ మధ్య ఉన్న తేడాను వివరిస్తున్నారు. అదే సమయంలో మనుషుల్లో ఒకనాడు లేని మానసిక ఒత్తిళ్లు, దిగులు, ఆందోళన ఇప్పుడు ఎందుకు ఉన్నాయో వివరించడం మొదలు పెట్టాడు వక్త.

"అవసరం ఉన్నవన్నీ కొనుక్కుంటూ పోతే, ఏదో ఒక రోజున అత్యవసరమైన వాటిని అమ్ముకోవలసి వస్తుంది.'' అన్నాడో ఆర్థిక వేత్త. ఆర్థిక మేకాదు, అతిగా వ్యవహరించే జీవితంలోని అన్ని సందర్భాలకూ ఈ సత్యం వర్తిస్తుంది. అవసరాలు పెరిగే కొద్దీ వాటికి అనుగుణంగా మన సంపాదన కూడా పెర గాలి కదా! అంటూ ఉంటారు. కానీ, అవసరాలు వాటికవే పెరిగాయా? మనమే వాటిని పెంచుకున్నామా? అని ప్రశ్నించుకుంటే, కాస్త ఆలస్యంగానే అయినా ఒక సమాధానం వస్తుంది. మన ం అవసరాలు అనుకుంటున్న వాటిలో సగానికి పైగా మనం పెంచుకున్నవే ఉంటాయి. అయినా పెరిగితే ఏమిటి? పెంచుకుంటే ఏమిటి? అవన్నీ మన జీవితానికి ఉపకరించేవే కదా! అనిపించవచ్చు. కానీ, ఇబ్బడి ముబ్బడిగా పెంచుకున్న ఆ అవసరాల కోసం మనం ఏమైపోతున్నాం? రెట్టింపు చాకిరీ చేస్తున్నాం. దీని వల్ల కొన్నిసార్లు విశ్రాంతికీ, చివరికి నిద్రకు కూడా దూరమవుతున్నాం.

వరుసగా కొంత కాలం నిద్రకు దూరమైతే ఆ తరువాత నిద్ర కావాలన్నా రాకుండా పోతుంది. నిద్రలేమి కేవలం శారీరక సమస్యే కాదు. దీర్ఘకాలికంగా ఆ సమస్య కొనసాగితే, అది ఒక మానసిక రుగ్మతకూ దారి తీయవచ్చు. దిగులూ ఆందోళనా, మానసికమైన కుంగుబాటు వంటి సమస్యలతో ఎక్కువ కాలం సతమతవుతున్న వారు అన్నీ ఉండి ఏమీ లేని వారిలా జీవిస్తారు. ఏదో ఒక దశలో తమకేదో అయిపోతోందని గుర్తించి, మానసిక వేత్తల వద్దకూ, ఆధ్యాత్మిక వేత్తల వద్దకూ తిరిగే పరిస్థితిలో పడిపోతున్నారు....'' వక్త మాటలు అక్కడ కూర్చున్న వారి గుండెల్లో సూటిగా గుచ్చుకుంటున్నాయి.

వారి స్థితిని గమనించిన వక్త వాక్పటిమను పెంచారు. " ఎక్కడైనా 8 గంటలు పనిచేసే వారు మనిషి అవుతారు. 16 గంటలు పనిచేసే వారు దెయ్యమవుతారు.'' అన్నారు. సభలో పిన్‌డ్రాప్ సైలెన్స్. ఆ మాట సరిగ్గా తమమీదే ఎక్కుపెట్టిన బాణంలా ఉందేమో, అందరూ తమలోకి తాము చూసుకోవడం మొదలెట్టారు. ఎంత కాదనుకున్నా ఇది ముమ్మాటికీ నిజమే... నిజమే అన్న ప్రతిధ్వని అందరి మనసుల్లో మార్మోగినట్టనిపించింది.

నిజమే కదా! సాంస్కృతిక విషయాలకో, మానసిక ఉల్లాసానికో ఏ మాత్రం సమయం లేని, ఎంత సేపూ వృత్తిపరమైన పనులకే పరిమితమైన వారు సహజంగా ఎలా ఉంటారు? అసహజత్వమేదో ఆవరించి దెయ్యంలాగే ఉంటారు. అవసరాలు అలాగే వున్నాయి కదా! అనే మాటను ఎదుటి వారెవరూ కాదనరు. కానీ, నీకు జరుగుతున్న నష్టమేదో నీకే తెలిసిపోతుంది కదా! అందుకే మనిషి మెలుకువతో ఉండే 16 గంటల్లో 8 గంటలకే వృత్తి పనులకు కేటాయించాలని, మిగతా 8 గంటలు మానసిక ఉన్నతికి, ఉల్లాసానికీ వినియోగించాలన్న సత్యాన్ని ఆ వక్త సింపుల్‌గా, సూటిగా చెప్పారనిపించింది. ఆ వాక్యాలు అక్కడున్న వారికే కాదు... అందరికీ వర్తిస్తాయేమో?!